ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని అన్ని జిల్లాలు కనెక్ట్ చేసేలా ఔటర్ రింగ్ రోడ్డు రాబోతోంది. అమరావతి ఓఆర్ఆర్కు సంబంధించి భూసేరణ ప్రక్రియ కూడా చేపట్టారు. గుంటూరు, పల్నాడుతో పాటుగా ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో భూసేకరణ చేపట్టారు. అయితే ఓఆర్ఆర్ను 140 మీటర్ల వెడల్పుతో నిర్మిస్తారని ప్రతిపాదించారు. అయితే అమరావతి ఔటర్కు సంబంధించిన గెజిట్లో మాత్రం 250 మీటర్లుగా పేర్కొన్నారట. దీంతో రైతులు అధికారుల్ని అడిగి క్లారిటీ తీసుకున్నారు. 250 మీటర్లు ముందు జాగ్రత్త మాత్రమేనని, ఓఆర్ఆర్ను మాత్రం 140 మీటర్ల వెడల్పుతోనే నిర్మిస్తామని అధికారులు సమాచారం అందించారు.
Total Views: 1




